Tuesday, December 29, 2015

ఏంటా యాపారం ?

ఏంటీ ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ ప్రాజెక్టు? ఆ వ్యాపారం మతలబేంటి?  ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి చేసిన ఫిర్యాదు వెనక సీరియసేంటి? అందులో ఎమ్మెల్యే కేఏ నాయుడు పాత్రేంటి? వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడిదే చర్చ విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడిపై శ్రీకాకుళం ఎస్పీకి ఛాయాకుమారి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఈ జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. ఇప్పటికే చెక్‌బౌన్స్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజా కేసు ఇరుకున పెట్టేదిలా కనిపిస్తోంది.

విజయనగరం జిల్లాలో చాలా దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్యేగా కె.ఎ.నాయుడిపై ముద్ర ఉంది. అంగన్వాడీ నియామకాలు... విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో ఆయనదే పైచేయి. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాల్లోనూ ఆయన హస్తముందని ఆరోపణలు ఉన్నాయి. దారికి తెచ్చుకునే వ్యూహంలో అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని జెడ్పీ సమావేశాల్లో గళమెత్తుతారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో ఆయనపై చెక్‌బౌన్స్ కేసులున్నాయి. కొంతకాలం నుంచి ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి.

టీడీపీ గ్రూపు రాజకీయాల్లోనూ ఆయనది కీలకపాత్రే. ఇలా...అన్నింటికీ కేంద్రబిందువు అవుతున్న ఆయనపై శ్రీకాకుళం జిల్లాలో ఎస్పీకి ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఇందులోనూ ఈయన హస్తముందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పినందునే రెండు విడతలుగా  రూ. 10లక్షలు వరకు బ్యాంకు ఖాతాలో వేశానని, ఆయనతో పలు పర్యాయాలు ఫోన్‌లో మాట్లాడానని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొనడంపై ఎంతమేరకు నిజముందో తెలీదుగానీ, విషయం విన్న అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

‘నిక్షేపం’గా దోపిడి

మూడు రాష్ట్రాల కూడలి  కుప్పంలో అక్రమ క్వారీలకు అడ్డు, అదుపూ లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో 150  క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో 40లోపు క్వారీ లకు వూత్రమే అనువుతులు ఉన్నారుు. అరకొరగా అనువుతులు ఉన్నవి, అసలు లేనివి కూడా పరిమితికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారుు. ఒకే పర్మిట్‌తో పదుల సంఖ్యలో లారీలు క్వారీ బ్లాకులను షిప్పు యూర్డులకు తరలిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయుం దళారుల ఖాతాలకు చేరుతోంది. కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు జిల్లాలోని  క్వారీల యుజ వూనుల నుంచి గత వుూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు సొంత పార్టీ వారే  చెప్పుకున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, పలవునేరు, కుప్పం ప్రాం తాల్లో విలువైన రాతి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా యి. గనుల శాఖ పరిధిలో 1200 వందల క్వారీలున్నాయి. ఇందులో 850 క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి.  దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఇక్కడి రాళ్లు ఎగువుతి అవుతున్నారుు. వీటి వ్యాపారంతోనే కోట్లు గడించిన వ్యాపార వేత్తలు, రాజకీయు నాయుకులు జిల్లాలో అనేక వుంది ఉన్నా రు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పొరు గు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాళ్లతో డాలర్ల పంట పండుతుండటంతో దీనికి సంబంధించిన అన్ని విషయూల్లో భారీగా నగదు చేతులు వూరుతోంది. రాళ్ల వ్యాపారులు ప్రభుత్వాన్ని, అధికార యుంత్రాంగాన్ని శాసిం చేంతగా ఎదిగారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

 
క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా వూరారుు. కనీస సదుపాయూలు, భద్రతా ప్రవూణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రవూదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోరుునా, వికలాంగులుగా వూరినా నావువూత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపు కొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుని ప్రవూదాలు జరిగితే ఇబ్బందు లు ఉంటాయున్న కారణంతో తమిళనాడు, చత్తీస్‌ఘడ్, బిహార్, ఒడిశాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయూలు కూడా లేకపోవటంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా మిగతా వారు పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఎలాంటి బీవూ, ఈఎస్‌ఐ సదుపాయూలు లేవు.

రాజధాని గ్రామాలు మాయం

రాజధాని కోసం సమీకరించిన భూముల్లో అధికభాగాన్ని రియల్ ఎస్టేట్‌కే వినియోగించనున్నారు. రాజధాని మాస్టర్ ప్రణాళికలో వర్గీకరించిన 20 జోన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది. ఏ జోన్‌కు ఎన్ని ఎకరాలో ఈ ప్రణాళికలో స్పష్టం చేశారు. దీని ప్రకారం మధ్యతరహా జనసాంద్రత గలిగిన రెసిడెన్షియల్ జోన్‌కు 12,002.5 ఎకరాలను, సాధారణ వాణిజ్య జోన్‌కు 2856.3 ఎకరాలను కేటాయించారు. ఈ రెండు జోన్‌లలోనే  రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలను కేటాయించనున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు.

అందుకోసం 8వేల ఎకరాలు సరిపోతాయని అంచనా. అంటే మిగిలిన ప్రాంతమంతా రియల్‌ఎస్టేట్ కోసమే వినియోగిస్తారని తెలుస్తోంది. ఈ రెండు జోన్‌లలో... భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించే చోట దాదాపు 7 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నారు. అక్కడ చిన్న, మధ్యతరగతి, ఎగువ తరగతిని ఆకర్షించే అపార్టుమెంట్లను, ఇళ్లను నిర్మించనున్నారు.


కోర్ రాజధాని వచ్చే మూడు గ్రామాలు మాయం కానున్నాయి. ఉద్ధండరాయుని పాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలు కోర్ రాజధానితో కనుమరుగు కానున్నాయి. ఆ గ్రామాలను పూర్తిగా అక్కడి నుంచి తొలగించనున్నారు. అలాగే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల్లో కాకుండా ఆయా గ్రామాల బయట స్థలాలు ఇవ్వాలని మాస్టర్ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఉదాహరణకు తుళ్లూరు గ్రామంలో రైతులకు ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలను ఎక్కడ ఇచ్చేది మాస్టర్ ప్రణాళికలో మ్యాప్ ద్వారా వివరించారు. దాని ప్రకారం అది రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Monday, December 28, 2015

మట్టిని కొల్లగొడుతున్నారు

గ్రావెల్ తవ్వకాలు నెల్లూరు జిల్లా కావలి అడ్డాగా మారింది. మొన్న దగదర్తి. నేడు అల్లూరులో అక్రమతవ్వకాలు వెలుగుచూశాయి. కౌరుగుంటలో టీడీపీ నేతలు అక్రమాలు బయటపడటంతో.. విజిలెన్స్ అధికారులు స్పందించారు. వాహనాలను సీజ్ చేసి,  అక్రమ తవ్వకాలకు అట్టుకట్ట వేశారు. తాజాగా అల్లూరు మండలం నార్త్ ఆమలూరులో జరుగుతున్న భారీ అక్రమ తవ్వకాలు బయటపడ్డాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వాణిజ్య అవసరాలకు గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గోరంత అనుమతులు అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో అటవీ, రైల్వే స్థలాల్లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.

సింగంపేట, బట్రకాగొల్లు మీదుగా నార్త్ ఆమలూరుకు వెళ్లే దారిపొడవునా 20 అడుగుల లోతులో భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. రోజుకు 200 నుంచి 300 ట్రిప్పర్లు గ్రావెల్ తరలిస్తున్నట్లు తెలిసింది. కొన్ని సందర్భాల్లో రోజుకు 600 ట్రిప్పర్ల గ్రావెల్ కూడా తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో టిప్పర్ కు నాలుగు యూనిట్ల గ్రావెల్ నింపుతున్నారు. ఈ లెక్కన రోజుకు 1200 నుంచి 2400 యూనిట్ల గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నట్లు తెలుస్తోంది. గ్రావెల్ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతల హస్తం ఉండటంతో.. అధికారులు కూడా చూసీచూడనట్లు పోతున్నారు.

ఇద్దరూ అక్కడే.. పాలన ఎక్కడ..?

అమరావతి పరిధిలోకి వచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాలన పడకేసింది. కలెక్టర్లు బాబు, కాంతిలాల్ దండేలకు సమర్థ అధికారులుగా గుర్తింపు ఉన్నా.. వారు ఎక్కువగా రాజధాని పనులమీదే దృష్టి పెట్టడం కొత్త సమస్యలకు దారితీస్తోంది. కలెక్టర్ స్వయంగా చూసి సంతకం చేయాల్సిన ఫైళ్లు, అప్రూవళ్లు అన్నీ నిలిచిపోవడంతో ఈ రెండు జిల్లాల్లో జనం లబోదిబోమంటున్నారు.
    కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. దీనికి జిల్లా పరిధిలోని మండల అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలి పాలనాపరంగా ఇది మంచిదే అయినా ఏకంగా రాత్రి పదకొండు గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ జరపడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
   ఇక గుంటూరు జిల్లాలో భూసమస్యలు, వివాదాలు ఎక్కువ. వీటిలో చాలా వరకు పెద్దతలకాయల ఫైళ్లు ఉన్నాయి. కొన్ని ఫైళ్లు ఎమ్మార్వోలు, ఆర్డీవోలు క్లియర్ చేసినా.. కీలక ఫైళ్లు కలెక్టర్ చూడాల్సి ఉంది. అయితే కాంతిలాల్ దండేకు తీరిక లేకపోవడంతో ఫైళ్లన్నీ కలెక్టరేట్లో పేరుకుపోయాయి.

అ.. అమ్మ, ఆ.. ఆకలి

అక్షరాలు రానివారు కూటి కోసం బాథలు పడుతున్న నేటి రోజుల్లో.. అక్షరాలు వచ్చినవారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. చిత్తూరు జిల్లాలో సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేస్తున్న విలేజ్, మండల కోఆర్డినేటర్ల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న సామెతను గుర్తుచేస్తోంది. దాదాపు ఏడాది నుంచి వేతనాలు రాక వీరు ఆకలితో పస్తులుంటున్నారు.
   చిత్తూరు జిల్లాలో సాక్షర భారత్ కింద పదిహేనేళ్లలో నాలుగు లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చారు. సాక్షర భారత్ కింద విలేజ్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు ఉంటారు. విలేజ్ కోఆర్డినేటర్లకు రెండు వేలు, మండల కోఆర్డినేటర్లకు ఆరువేలు జీతాలు చెల్లిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత సాక్షర భారత్ కు నిధులు విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు.
    వచ్చేదే బొటాబోటీ జీతాలు, ఇక ఏడాది పైగా జీతమే రాకపోతే తామెలా బతకాలని సాక్షర్ భారత్ కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరు చూస్తుంటే.. మీ ఇంట్లో తినండి.. మా ఇంట్లో పనిచేయండి అన్నట్లుగా ఉందని వాపోతున్నారు.

మాస్టర్ ప్లాన్ లో రైతులకు చోటేది..?

సింగపూర్ సంస్థలు రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్ లో రైతులకు చోటు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులను సింగపూర్ తో పాటు ఏపీ సర్కారు కూడా మరిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్డీఏ వెబ్ సైట్లో పొందుపరిచిన మాస్టర్ ప్లాన్ లో భూములిచ్చిన రైతులకు ఎక్కడ భూములిస్తారనే విషయంపై స్పష్టత లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని పరిధిలో తొమ్మిది నగరాలు వస్తాయని, వాటి వివరాలు సవివరంగా ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు అవసరమైన సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములకు  చోటు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూసమీకరణ అయ్యేదాకా రైతులు త్యాగధనులంటూ కీర్తించిన చంద్రబాబు.. ఇప్పుడు  మాస్టర్ ప్లాన్ కు గప్ చుప్ గా ఆమోదముద్ర వేశారని ఆరోపిస్తున్నారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు వరుసగా 125, 500, 1000 గజాల స్థలంలో ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, రైతులకు కేటాయించే స్థలంలో ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తారనే విషయాల కోసం సీఆర్డీఏ వెబ్ సైట్ చూసిన రైతులకు నిరాశే మిగిలింది. మాస్టర్ ప్లాన్ ఆమోదించాక ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రభుత్వం.. రైతులను నట్టేట్లో ముంచే ప్లాన్ లో ఉన్నట్లుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.